వివరాలు
డౌన్లోడ్ Docx
ఇంకా చదవండి
ఈ ఎపిసోడ్లో, సుప్రీమ్ మాస్టర్ చింగ్ హై ప్రార్థన మరియు మానవ చిత్తశుద్ధి యొక్క శక్తిని, అలాగే సత్యం పట్ల మరియు పైనుండి సహాయం కోసం ఉండే ప్రగాఢమైన తపన, గురువులు ఎక్కడ ప్రత్యక్షమవుతారనే దానిని ఎలా ప్రభావితం చేయగలదో వివరిస్తారు.అక్కడ ఉన్న ఆ పెద్దమనిషి, ఒక సామాన్య వ్యక్తి గురువును ఎలా ఎన్నుకోవాలి అనే దాని గురించి ఇప్పుడే ఒక ప్రశ్న అడిగారు. నా ప్రశ్న మరింత ఒక గందరగోళమైనది; బహుశా అది దీనికి విరుద్ధంగా ఉండవచ్చు.) అవును. (ఒక గురువు శిష్యులను కాదు - భూమిని ఎలా ఎన్నుకుంటాడు?) మీరు అమితాభ భూమి గురించి, అంటే బోధించాల్సిన భూమి గురించి మాట్లాడారు కాబట్టి. కాబట్టి నా ప్రశ్న ఏమిటంటే, మీకు అనేక భాషలు వచ్చు మరియు మీరు ప్రపంచమంతా పర్యటించారు కదా, అయినప్పటికీ మీ మొదటి బోధనా కేంద్రంగా తైవాన్ను ఎందుకు ఎంచుకున్నారు? మరియు నా మనసు వెనుక ఉన్నది మీరు ఇప్పుడే ప్రస్తావించిన ప్రశ్నే. ఈ రోజుల్లో చాలా మంది మాస్టర్స్ పనిచేస్తున్నారు. మరియు నేను మీకు నిజాయితీగా చెప్పాలి, ఒక సామాన్యుడిగా మరియు ఆలోచించాలనుకునే వ్యక్తిగా, ఒకవేళ నేను ఈ మహనీయులు నేడు ఎక్కడ ఉన్నారో వారి జ్ఞానాన్ని సేకరించి, వారు నెలకొని ఉన్న భూములను అధ్యయనం చేస్తే, నాకు ఏమైనా ఆధారాలు దొరకవచ్చా? ఈ భూముల మధ్య ఏమైనా సారూప్యతలు ఉన్నాయా, మరియు ఈ అధిపతులు ఈ భూములను ఎంచుకోవడానికి గల తర్కం ఏదైనా ఉందా? ధన్యవాదాలు.) అవును, అవును. చూడండి, అది ఆ ప్రాంత ప్రజల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. తైవానీయులు (ఫార్మోసన్) చాలా నిజాయితీపరులు, వారి హృదయాలు చాలా స్వచ్ఛమైనవి. వారు తమను రక్షించమని దేవుడిని, బుద్ధుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. నిస్సందేహంగా, భౌతిక సుఖాలను, ప్రాపంచిక ఆస్తులను, తమ ప్రాపంచిక కోరికల నెరవేర్పును మొదలైనవాటిని కోరుకునేవారు కొందరు ఉన్నారు. కానీ తైవానీయులు (ఫార్మోసన్) హృదయపూర్వకంగా చాలా స్వచ్ఛమైనవారు. వినాశకరమైన నాగరికతా ప్రభావం వల్ల అవి ఎక్కువగా చెడిపోలేదు లేదా నాశనం కాలేదు. కాబట్టి వారు చాలా పవిత్రులు, అందుకే వారికి సహాయం చేయమని నన్ను అడిగారు. నేను రాకముందు వారు తమ హృదయాలలో అడిగారు. అందువల్ల, నేను తైవాన్ (ఫార్మోసా) వెళ్ళక ముందే, చాలా మంది తమ ధ్యానంలో నేను కనిపించడాన్ని చూశారు. వారు నా పద్ధతిలో ధ్యానం చేయలేదు. వాళ్ళు ఎలాగోలా ధ్యానం చేస్తూ, అక్కడ నిశ్శబ్దంగా కూర్చున్నారు, అంతలోనే నేను రావడం చూశారు. అందువల్ల, నేను వచ్చినప్పుడు వాళ్ళు నన్ను గుర్తుపట్టారు. అంటే నాకు తైవానీస్ (ఫార్మోసన్) ప్రజలతో చాలా సాన్నిహిత్యం ఉంది. అది సులభం, అలా, బహుశా గత జన్మలలో కావచ్చు. కానీ వాస్తవానికి, బుద్ధుడు దేనినీ ఎంచుకోడు. అంటే, మీకు అర్థమయ్యేలా ఒక విషయాన్ని చెప్పడం లాంటిది. ప్రజల కోరిక మేరకు బుద్ధుడు వస్తాడు.మరి ప్రశ్న ఇంకేముంది? మీరు ఏమి అడిగారు? ఇంకా కావాలా? ఇది సరిపోతుందా? (అవును, మాస్టర్స్ ఎంపిక చేసే భూములను పోల్చాలని నేను అనుకుంటున్నాను.) ఉదాహరణకు, ఈ ప్రాంతాలలో బహుశా ఎక్కువ బాధలు ఉన్నాయని, లేదా ఇది వారిని అమితాభ భూమికి వెళ్ళడానికి సహాయపడుతుందని నేను బహుశా అర్థం చేసుకోగలను.) అర్థమైంది. (కానీ దాని అర్థం మీరు...) అందుకే గురువుగారు భూమికి వచ్చారు, అవునా? మీ ఉద్దేశ్యం అదేనా? ఓహ్, ఎందుకు కాదు? ప్రజలు ప్రార్థించడం వలనే. ప్రజలు దేవునితో, “ఓ దయచేసి, మమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి ఎవరినైనా పంపించు” అని ప్రార్థిస్తారు. లేదా (ప్రభువైన) యేసుకి, “దయచేసి, మాకు సహాయం చేయరా?” అని ప్రార్థించండి. లేదా బుద్ధునికి ఇలా ప్రార్థించండి, “దయచేసి, మమ్మల్ని ఈ దుఃఖం నుండి బయటపడవేయవద్దు.” కాబట్టి బుద్ధులు, లేదా దేవుడు అని పిలవబడేవాడు, లేదా ఏసుక్రీస్తు చైతన్యం “ఏదో ఒకదాన్ని” పంపుతారు. మరియు అది హృదయపూర్వకంగా ప్రార్థించే ప్రజలతో నేరుగా మాట్లాడటానికి, మరియు వారిని ఒక్కొక్కరిగా, గుంపు గుంపులుగా, దేశం దేశంగా వచ్చి తీసుకువెళ్ళడానికి ముక్కు, కళ్ళు, చెవులు – అనగా సర్వం – కలిగిన శరీరంగా ప్రత్యక్షమవుతుంది. వారు వెళ్లి ఆ బుద్ధుడిని లేదా దేవుడిని, దైవశక్తిని ప్రార్థిస్తున్న వారిని ఎంపిక చేసుకుంటారు. కొన్నిసార్లు దేవుడు చాలా మందిని పంపుతాడు; కొన్నిసార్లు బుద్ధుడు చాలా పంపుతాడు. కొన్నిసార్లు వాళ్ళు కొన్ని పంపిస్తారు. నేను చాలా మంది మాస్టర్స్ అని చెప్పినప్పుడు, దయచేసి అంత ఎక్కువ మంది అని నా ఉద్దేశం కాదు. అంత ఎక్కువ మంది కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ, అంటే సుమారు ఐదు లేదా ఆరు అయితే గరిష్టం. అంత మంది ఉండటానికి అవకాశం లేదు. మీరు బయటకు వెళ్ళినప్పుడల్లా ఏ గురువునైనా అనుకోకుండా కలవలేరు. లేదు, లేదు, లేదు. గరిష్టంగా ఐదు లేదా ఆరు. దయచేసి, రండి.(ఇప్పటివరకు, దేవుడు, లేదా దేవతలు, లేదా వారి దూతలు, అనగా "ప్రవక్తలు" అని పిలవబడే వారు చేసిన ప్రయత్నాలన్నిటితో పాటు, చరిత్రతో కలిసి మనం ఈ విశ్వాన్ని – అన్నిటికంటే మన ప్రపంచాన్ని ముందుగా, – ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాం, కానీ వాళ్ళు మాత్రం శారీరకంగా, మానసికంగా బాధలను ఆపి, ఈ ప్రదేశాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చారు, కదా? ఇక్కడ, స్వర్గంతో సహా, వాస్తవానికి. సమగ్రమైన స్వర్గం, దైవరాజ్యం లేదా నిర్వాణ స్థలం, లేదా మరేదైనా – మేము ప్రయత్నించాము. ఇప్పటివరకు అది సాధించబడలేదని మనకు తెలుసు. సాక్షాత్తు భగవంతుడు లేదా దేవత, మరియు వారి దూతలు, ఈ భూమండలంపై ఉన్న వారి మేటి నాయకులు, ఆ మేటి సంస్థలు మరియు దేశాలు, ఉద్భవించి పతనమవుతున్న సమూహాలు చేసిన అద్భుతమైన, సర్వశక్తివంతమైన ప్రయత్నాలన్నిటి తర్వాత కూడా, ఇప్పటివరకు మన ప్రపంచం ఇంకా అసంపూర్ణంగానే ఉంది. మరియు బహుశా మనం ఇప్పుడు ప్రవేశిస్తున్నాము చరిత్ర ముగింపులోకి – మనకు తెలియదు – ఒక విపత్తు. ఎందుకంటే చాలా మంది ప్రవక్తలు మనకు ఒక సందేశాన్ని పంపడానికి ప్రయత్నించారు, అది కొన్నిసార్లు అంత సంతోషకరమైనది కాదు, కొన్నిసార్లు చాలా హెచ్చరికతో కూడుకున్నది. ఆ సందేశం ఏమిటంటే, మనం నేర్చుకోకపోతే, సరిగ్గా ప్రవర్తించకపోతే, మన మానవ చరిత్ర యొక్క అంతిమ దినాలను చేరుకోవడానికి మనం సృష్టించుకున్న తప్పుడు విషయాలనే ఎదుర్కొంటాము.మరియు ఇప్పుడు, నేను అంతర్జాతీయ సంబంధాల నిపుణురాలిని. అందువల్ల, నా రంగంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నా ఆందోళనలు రెండు. ఒకటి ఏమిటంటే, ఇప్పుడు, కొన్ని రంగాలలో, కొన్ని వర్గాలలో, కొన్ని దేశాలలో విజయవంతమైన కృషి మరియు విజయాలు సాధించబడ్డాయి, ఉదాహరణకు భారతదేశంలో బుద్ధుడు చేసినట్టు, మరియు ఇప్పుడు తైవాన్ లేదా దక్షిణాసియా దేశాలలో, మంచి ప్రదేశాలన్నింటిలో, అక్కడక్కడా క్రైస్తవ మతం కూడా. చాలా చర్చిలు నిర్మించబడ్డాయి.అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే... మొత్తం విధానానికి మరియు చిన్న విధానానికి మధ్య వ్యత్యాసం ఉంది. ఇప్పుడు నాకు ఆందోళన కలిగిస్తున్నది మొత్తం మార్పు గురించే. మీరు మాకు బోధించడానికి ప్రయత్నిస్తున్నట్లుగా, కేవలం సమాజం నుండి సమాజానికి, మతం నుండి మతానికి మాత్రమే కాదు. మతాల మధ్య తేడాలు మరీ పెద్దవి కావు, సమూహాల మధ్య తేడాలు మరీ పెద్దవి కావు. ఇప్పుడు నా ఆందోళన సార్వత్రిక, ప్రపంచవ్యాప్త, సంపూర్ణ విధానం గురించే. అంటే, ఈ మానవ జాతిలోని అత్యధికులతో కలిసి, ఈ మానవ సమూహాన్ని, ప్రపంచ సమూహాన్ని, ఈ ఉమ్మడి సంతోషకరమైన ప్రపంచాలను కలిగి ఉండేలా మనం – లేదా మీరు – ఎలా నడిపించగలం? మనం క్రైస్తవులమైనా, బౌద్ధులమైనా ఫర్వాలేదు; మేము పట్టించుకోము. నాకు ఇప్పుడు తెలిసింది ఏమిటంటే, నా కొద్దిపాటి సమయాన్ని గానీ, నా కొద్దిపాటి అస్తిత్వాన్ని గానీ, నా చిన్న దేశాన్ని గానీ, లేదా నా చిన్న సమాజాన్ని గానీ త్యాగం చేసి, ఈ సంపూర్ణమైన, శాశ్వతమైన ప్రపంచాన్ని పొందడమే జ్ఞానోదయం. కాబట్టి, నా ఆందోళన ఇదే: మన సత్య ప్రపంచం లేదా -జ్ఞానోదయం మనకు ఎలా, ఎప్పుడు లభిస్తుంది? రెండవది, నా ప్రశ్న ఇప్పుడు భవిష్యత్తు గురించి, భవిష్యత్ శాస్త్రం పరంగా. కన్ఫ్యూషియనిజం లేదా నియో-కన్ఫ్యూషియనిజం, టావోయిజం, యిన్ మరియు యాంగ్, ఐ-చింగ్ వంటి వాటితో సహా, గురువులందరూ భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మనకు చెప్పడానికి ప్రయత్నించారు.నాకు గానీ, ఒక చిన్న సమూహానికి గానీ, దేశానికి గానీ ఏమి జరిగినా నాకు పట్టింపు లేదు. మన మానవ జాతికి, ఈ భూగోళానికి ఏమి జరుగుతుందోనని నేను ఆందోళన చెందుతున్నాను – నోస్ట్రాడమస్ ఊహించినట్లుగ, చాలమంది ఊహించినట్లుగా మనకు ఒక విపత్తు సంభవిస్తుందా లేదా అని. అంటే, శాన్ హోసేలో ఇప్పుడు భూకంపం వల్ల ఆ విధంగా ఇబ్బందులు పడుతోంది. ఎప్పటికైనా ఇంతకంటే ఘోరమైనది ఎదురవుతుందని అంటారు.అయితే, ఈ సంపూర్ణ, సమగ్ర మరియు సమ్మిళిత సంతోషకరమైన ప్రపంచాన్ని మనం ఎలా, ఎప్పుడు పొందగలమో దయచేసి మాకు చెప్పగలరా? లేకపోతే, మనమందరం ఎప్పుడు చనిపోతాము? దయచేసి మాకు చెప్పగలరా? ధన్యవాదాలు.) అవును, నేను మీకు చెప్పగలను.యావత్ మానవాళిని ఆనందం వైపు ఎలా నడిపించాలి అనేది మీ మొదటి ప్రశ్న, అవునా? యావత్ మానవాళిని ఎలా సంతోషపెట్టాలి? (అయితే, ప్రపంచవ్యాప్త విజయాలు ఎలా సాధించబడతాయంటే, వ్యక్తి ద్వారా కాదు.) అవును, తప్పకుండా, కానీ వాళ్లకు ఏమి చేయాలో నేను చెప్పలేను. ప్రజలందరికీ, రాజకీయ నాయకులందరికీ, అన్ని దేశాల అధ్యక్షులందరికీ ఏమి చేయాలో నేను చెప్పలేను. వారు వినరు. కాబట్టి, ఇది “ఎలా చేయాలి?” అనే ప్రశ్న కాదు. “నేను వాళ్లకు ఎలా చెప్పాలి?” ఇది కష్టం. ఏ గురువు కూడా దీన్ని ఎన్నడూ సాధించలేదు. అవును. సరిగ్గా. సత్యాన్ని మనస్ఫూర్తిగా కోరుకునే మీలాంటి లేదా ఇక్కడున్న వారిలాంటి వ్యక్తులతో మాత్రమే మనం మాట్లాడగలం. ఆ విషయం నేను వాళ్లకు చెప్పగలను.కానీ ఇప్పుడు నా చిన్న ప్రశ్న, మనం సాంస్కృతిక విపత్తును ఎదుర్కొంటామా, లేక భవిష్యత్తులో మన మానవ జాతికి స్వర్గమో నరకమో అనే అదృష్టం కలుగుతుందా? సరే, నేను... (ఎప్పుడు? ఎలా?) సరే రేపు, మీకు కావాలంటే... రేపు దీక్షా కార్యక్రమంలో, కనీసం స్వర్గం ఎక్కడ ఉందో మరియు దానిని ఎలా పొందాలో నేను మీకు చూపిస్తాను. ఇక నా దగ్గరకు రాని మిగతా వారికి నేను సహాయం చేయలేను. మనం ప్రజలను స్వర్గానికి వెళ్ళమని బలవంతం చేయలేము, గమనించండి. మనం ఆ విషయం తెలుసుకోవాలి. లేకపోతే, (ప్రభువైన) యేసు వారందరినీ దేవుని రాజ్యంలోకి బలవంతంగా తీసుకువెళ్లి ఉండేవాడు. బుద్ధుడు వారందరినీ బుద్ధుని భూమిలోకి బలవంతంగ తరలించి ఉండేవాడు. లేదు. మనం తర్కం ద్వారా మాత్రమే కొంతమందిని ఒప్పించగలం. మరియు ప్రజలు విశ్వసిస్తే, అప్పుడు వారు వస్తారు.Photo Caption: “ఒకవేళ ఎవరైనా తమ అంతరంగంలోని దైవిక సౌందర్యాన్ని దర్శించగలిగితే, అది అత్యంత సూక్ష్మమైన వివరాలతో కూడిన రాజసం ఉట్టిపడే అద్భుత సౌందర్యంగా గోచరిస్తుంది!”











